కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని ప్రధాన ఆలయాలు చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మూసివేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు, శివాలయాలు ఇలా అన్ని రకాల ప్రధాన ఆలయాలను మూసివేశారు. రేపు ఉదయం ఆలయాలను తెరుస్తారు. అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు.