విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం నందు ఎస్ఎఫ్ఐ ఛలో కలెక్టరేట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ.. ఆగస్టు 25న విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.