గాంధీభవన్ వద్ద మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ఎన్నికల కమిషన్ సహకారంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని ముట్టడించేందుకు బయలుదేరడంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు చోర్ గద్దిచోడ్ అంటూ నినాదాలు చేశారు.