మంత్రాలయం: నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసే పోలింగ్ బూత్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని నియోజకవర్గ ఎన్నికల అధికారిని అనురాధను వైసీపీ నేతలు మంగళవారం కోరారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసే పోలింగ్ బూత్లను ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, విశ్వనాథ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, గురురాజ రావు, తెల్లబండ్ల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.