నరసన్నపేట పట్టణ నడిబొడ్డున ఉన్న గోరువాని చెరువు నేడు మురికి కూపంగా మారిపోతుంది. దీనిపై పంచాయితీ అధికారులు సరియైన పర్యవేక్షణ చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానిక వాసులు వాపోతున్నారు. గణేష్ నిమజ్జనం తదితర పూజలు కోసం ఈ చెరువును ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో ఇక్కడే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ చెరువు అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.