కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి దీంతో హౌసింగ్ బోర్డు కాలనీలోని స్మశాన వాటిక మరియు ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.ఆ రోడ్డును మంగళవారం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ. వెంటనే అధికారులు స్పందించాలని రోడ్డు నిర్మించాలని స్మశాన వాటికను నిర్మించాలని కోరారు.