Araku Valley, Alluri Sitharama Raju | Aug 26, 2025
ఈగల్ టీం ఆధ్వర్యంలో అరకులోయలోని పలు విద్యా సంస్థల్లో మంగళవారం విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. గంజాయి వంటి డ్రగ్స్ వినియోగం వలన కలుగు శారీరక, మానసిక సమస్యలను, రవాణ, సాగు వలన కలుగు చట్టపరమైన శిక్షల గురించి ఈగల్ ఇన్స్స్పెక్టర్లు కళ్యాణి, ధనుంజయనాయుడు లు వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటు నినదించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.