మచిలీపట్నం లో మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మినిమం టైమ్ స్కేల్పై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలను సమర్పించారు. 25 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు విశేష సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు.