హైదరాబాద్ బోడుప్పల్లో మంగళవారం జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సంగారెడ్డికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపారు. రామ్ చరణ్, అభిరామ్, ఆకాష్ బంగారు పతకాలు సాధించారు. ఆదిత్య, శివ కాంస్య పథకాన్ని దక్కించుకున్నారు. అండర్-14 విభాగంలో ఆకాష్ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించారు. వీరిని గ్రాండ్ మాస్టర్ బాలేశ్వర్ అభినందించారు