హిమాయత్ నగర్: బెట్టింగ్ యాప్స్ కేసులో లకడికపూల్ లోని సిఐడి కార్యాలయానికి హాజరైన నటుడు విజయ్ దేవరకొండ
బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ నిమిత్తం నటుడు విజయ్ దేవరకొండ లకిడికపులోని సిఐడి కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కేసు నిమిత్తం పది రోజుల క్రిందట సిఐడి అధికారులు విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు సిఐడి కార్యాలయానికి నటుడు విజయ్ దేవరకొండ హాజరు కావడంతో ఆయనను ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.