ఇబ్రహీంపట్నం: షాద్నగర్ లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్ మున్సిపాలిటీలోని నాలుగవ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం మధ్యాహ్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అందిస్తున్న సమయముతో ఉండిన పులిహోరను తిన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కళ్ళల్లో సొంతింటి కల నెరవేర్చిన ఆనందం చూస్తుంటే ఇది ప్రజా ప్రభుత్వ విజయం గా భావిస్తున్నామని అన్నారు. పేదల కళ్ళల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.