కావలిలోని ఎరువుల దుకాణాలను డివిజనల్ వ్యవసాయ అధికారి నాగరాజు, కావలి ఏవోతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. యూరియా స్టాక్ పాయింట్ను పరిశీలించి స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా అమ్మకాలను కొనసాగించాలని, రైతులకు నాణ్యమైన ఎరువులు మాత్రమే అమ్మాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన కార్డులు ఉంటేనే రైతులకు యూరియా విక్రయించాలన్నారు.