కళ్యాణదుర్గం: కుందుర్పి మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న కారును ఢీకొన్న బైక్, యువకుడికి తీవ్ర గాయాలు
కుందుర్పి మండల కేంద్రంలోని మార్కెట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనం ఢీకొనింది. ప్రమాదంలో శ్రీ మజ్జన పల్లి కి చెందిన ద్విచక్ర వాహనదారుడు హర్ష తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ప్రమాదంలో గాయపడిన బైకర్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు కళ్యాణ దుర్గం తరలించారు. ఈ సంఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.