అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో శనివారం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు ఆత్మకూరు అనంతపురం రూరల్ మండలాలకు సంబంధించిన 17 మందికి 11 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని. భవిష్యత్తులో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకుంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.