నిర్మల్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
Nirmal, Nirmal | Sep 17, 2025 నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణను నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకున్నారు. ఎంతోమంది యోధుల పోరాటంతో నిజాం, రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని, అందుకే బీజేపీ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని అన్నారు. నిజాం పాలన నుండి విముక్తి లభిస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నిర్వహిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్