హిమాయత్ నగర్: సికింద్రాబాద్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్లోని తహసిల్దార్ కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఈ పథకాలను తీసుకొని వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.