పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గంలో సోమవారం ఉదయం 18.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి పెరిగింది. సోమవారం ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 17. 0 డిగ్రీలు, గుమ్మడిదలలో 17.8 డిగ్రీలు, అమీన్పూర్ లో 21.0° డిగ్రీలు, రామచంద్రాపురంలో 16.7 డిగ్రీలు, పటాన్ చెరులో 18.6° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 70.4% గా నమోదయింది. ఉదయం పూట చలి నుండి ఉపశమనం పొందేందుకు చలి మంటలను కాచుకుంటున్నారు.