హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల కోసం స్వస్థ్ నారీ - స శక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో స్వస్థ్ నారీ - స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఇంటి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబాన్ని కూడా చూసుకోగలదని, అందుకోసం ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాలు కోసం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ తదితర ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు