గద్వాల్: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం సరైనది కాదు: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ
ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివోఏ ల జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు 8 గంటల నుండి, 10 గంటలకు పని దినాలను పెంచుతూ జోవో ను జారీ చేసిందని అన్నారు.ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం ఒక కార్మికుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేయాలని, వారానికి 48 గంటలకు మించకూడదన్నారు.కానీ తెలంగాణ రాష్ట్రములో కార్మిక సంఘాలతో కనీసం చర్చించకుండా ఏక పక్షంగా ప్రభుత్వం పని గంటలను పెంచుతూ జారీ చేసిన జోవోను తాము తీవ్రంగా వ్యతిరేకస్తున్నామని అన్నారు.