ఇబ్రహీంపట్నం: ఈ దేశ చట్టపరమైన వ్యవస్థలకు కూడా దళితులు అంటరాని వారయ్యారా : ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ
షాద్నగర్ లో ఆదివారం మధ్యాహ్నం ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి జరిగితే దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనవహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని అన్నారు. ఈ దేశ చట్టపరమైన వ్యవస్థలకు కూడా దళితులు అంటరానివారయ్యారా అని నరసింహ మాదిగ మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.