జమ్మలమడుగు: బద్వేల్ : దొంగ నోట్ల మార్పిడి కేసులో ఐదుగురికి 7 సం.ల సాధారణ జైలు శిక్ష
కడప జిల్లా బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పద్మశ్రీ మంగళవారం సిద్ధవటం పి.ఎస్ పరిధిలో 2010 సం. లో జరిగిన దొంగ నోట్ల మార్పిడి కేసులో 5 మంది ముద్దాయిలకు 7 సం. ల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 5,000/- జరిమానా విధిస్తూ కోర్ట్ తీర్పు నిచ్చారు. సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పి షెల్కె నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.