విద్యార్థులు భగవగ్గీత చదువుతే ఉన్నత స్థాయికి ఎదుగుతారని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ కర్నూలులో అన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు మాంటీస్సోరి విద్యా సంస్థల సర్ణోత్సవాల సందర్భంగా మాంటిస్సోరి ఇండస్ స్కూల్ లో 4,028 మంది విద్యార్థులు భగవగ్గీత 15వ అద్యాయంలోని 20 శ్లోకాల పారాయణం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవగ్గీత ను అహింతవాది అయినా మహాత్మా గాంధీ, తుపాకీ తోనే బ్రిటన్ వారిని తరిమికొట్టాలన్న సుభాష్ చంద్రబోస్ నమ్ముకుంది భగవగ్గీత అన్నారు.అలాంటి భగవగ్గీత భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అన్నారు.