సంక్రాంతి పండగ పురస్కరించుకొని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేటు బస్సులలో టికెట్ అధిక ధరలకు అమ్మకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎంవిఐ మాధవరావు అన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేయడం జరిగిందన్నారు. డ్రైవర్స్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి డ్రైవింగ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించినట్లు తెలిపారు.