ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామానికి చెందిన పోలసాని వెంకటనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మార్కాపురం వైసీపీ సమన్వయకర్త గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వెంకటనారాయణ పార్థివదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.