కూకట్పల్లి ఐడీయల్ చెరువు వద్ద కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘ఆరైవ్ ఆలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేశ్ రెడ్డి హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, వేగ నియంత్రణ పాటించడం, మొబైల్ ఫోన్ వినియోగం నివారించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగింది.