కొన్ని మీడియా ఛానల్లో కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యను మారుస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని కళ్యాణదుర్గం వైసీపీ నియోజకవర్గం అబ్జర్వర్ మహేందర్ రెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం లోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆయన తలారి రంగయ్య తో కలిసి మాట్లాడారు. తలారి రంగయ్య సమన్వయకర్తగా కొనసాగుతారని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. తలారి రంగయ్య నాయకత్వంలో పార్టీ శ్రేణులందరూ పనిచేయాలని కోరారు. పార్టీ అధిష్టానం ప్రకారం మనమందరం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.