ఇబ్రహీంపట్నం: సరూర్నగర్ డివిజన్ సమస్యలపై డిప్యూటీ కమిషనర్ను కలిసి వివరించిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
సరూర్నగర్ డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను చర్చించేందుకు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసును ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు చెత్త సమస్యలు ఆయనకు వివరించారు.ఈ సందర్భంగా ఆమె ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలంటూ కార్పొరేటర్ కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన డిప్యూటీ కమిషనర్ అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.