పటాన్చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం : మున్సిపల్ కమిషనర్ తిరుపతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని కమిషనర్ తిరుపతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం భవనంపై జాతీయ జెండాను ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.