ఎవరైనా సరే సృహ తప్పి పడిపోతే పల్స్ చెక్ చేయడం గుండెపోటు అని నిర్ధారించడం అందుకు సి పి ఆర్ ఎలా చేయాలి అనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్యాధికారులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం డాక్టర్ ఆయేషా సిహెచ్ఓ లక్ష్మీనారాయణ ఆధ్వరంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా సరే సృహాతప్పి పడిపోతే నాడి పరిశీలించి సిపిఆర్ చేసే విధానం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పి సింధు ఏఎన్ఎం ఆశా ఫర్హనా విజయ తదితరులు పాల్గొన్నారు