ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయొద్దని రాష్ట్ర వైసీపీ పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంగళవారం తమ కార్యాలయంలో తెలిపారు. వైసీపీ నాయకులు, కార్య కర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.