ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ శుక్రవారం కమీషనర్ రమణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో ప్రజలకు అందిస్తున్న అల్పాహారం నాణ్యతను పరిశీలించి ప్రజల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆహార నాణ్యత పై ప్రజలు ఫిర్యాదుల మేరకు తనిఖీ చేసి ఆహార తయారీదారులకు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన ఆహారాన్ని అందిస్తామని కమిషనర్ రమణబాబు తెలిపారు.