జూలూరుపాడు: జూలూరుపాడు లోని దొంగల బీభత్సం
జులూరుపాడు మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తండాలో ఒక ఎవరూ లేని సమయంలో వెళ్లి ఇంట్లో బీరువా పగులగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, 40 తులాల వెండి తో పాటు 30 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. అక్కడి నుండి పక్క గ్రామమైన పడమటి నర్సాపురం గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ దుకాణంలోకి దూరి వ్యవసాయానికి అవసరమైన వస్తువులు, విత్తనాలు మొలకెత్తిన తరువాత కప్పి ఉంచే సామగ్రి ఇతరత్రా అన్ని దోచుకెళ్లారు.ఇంటికి చేరుకున్న బాధితులు లోపలికి వెళ్లి చూసి లబోదిబోమని మొత్తుకోగా చుట్టుపక్కల వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న జులూరుపాడు సిఐ, ఎస్సై గ్రామానికి చేరుకుని పరిశీలించారు.