మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ గౌతమి అన్నారు. కళ్యాణదుర్గంలోని డంపింగ్ యార్డ్ వద్ద ప్రహరీ గోడ నిర్మాణానికి సోమవారం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీదేవితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నదన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.