రాజేంద్రనగర్: షాద్నగర్లో కురిసిన వర్షం.. ఇబ్బంది పడ్డ వాహనదారులు
షాద్నగర్ పట్టణంలో బుధవారం రాత్రి వర్షం కురిసింది. ఉదయం నుంచి సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి చల్లబడటంతో వర్షం ప్రారంభమైంది. దీనితో వ్యాపారులు, పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు, వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.