సెట్టూరు సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
అనంతపురం జిల్లా సెట్టూరు సమీపాన బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని బసంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. బసంపల్లి నుండి సెట్టూరుకు వెళ్తుండగా సెట్టూరు ఊరి బయట ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.