కడప జిల్లా చక్రాయపేట మండలం కుప్పగుట్టపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున (46) మంగళవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా మల్లికార్జున మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు.ఈ ఘటనపై చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.