ఇబ్రహీంపట్నం: వనస్థలిపురం డి మార్ట్ వద్ద బైకులు పార్కు చేస్తే చర్యలు తప్పవు
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం డి మార్ట్ వద్ద బైకులు పార్కు చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా అలా చేస్తే బైక్ స్కూటీలు పోలీస్ స్టేషన్కు తరలిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా చలానా విధిస్తామని తెలిపారు . బుధవారం మధ్యాహ్నం డిమార్ట్ ముందు పక్క గల్లీలో పార్కు చేసిన వాటిని ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడే కొందరికి ఫైన్ వేశారు.