ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం సిట్ విచారణలకే పరిమితమవుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని, ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేసులు, అరెస్టులతో పాలన కొనసాగించడం సరికాదని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.