కుందుర్పి మండలం ఆపిలేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు భోగి మంటలు వేసి చుట్టూ డాన్స్ చేశారు. గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. పాలు పొంగించారు. సంక్రాంతి వేడుకలు మూడు రోజులపాటు ఎలా చేస్తారో అచ్చం అలాగే చేశారు. ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.